Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి : కేసీఆర్‌కు గుత్తా లేఖ!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:24 IST)
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. 
 
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో నీటి విడుదల తగ్గించాలని కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. రబీ పంటల కోసం నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాని కోరారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు.
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments