Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఊరేగింపులో డీజే వద్దన్నారని.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (11:44 IST)
పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడానికి తండ్రి నిరాకరించడం వల్ల మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణాలోని వనపర్తి జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. అమరచింత మండలం కొంకలవానిపల్లెకు చెందిన తిరుపతయ్య మొదటి భార్య కుమారుడు అశోక్ పెళ్లి ఈ నెల 24న ఆత్మకూరు మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చయమైంది. 
 
అందుకోసం మంగళవారం జమ్ములమ్మ గ్రామ దేవత వేడుక చేసారు. పెళ్లి ఊరేగింపులో డీజే ఏర్పాటు చేయడం కోసం రూ.25 వేలు ఇవ్వమని తండ్రిని కోరాడు. ఇప్పటికే వివాహ ఖర్చు పెరిగిందని, డీజేకి బదులు భోజన ఏర్పాటు చేసేందుకు ఆ డబ్బును ఖర్చు చేద్దామని చెప్పాడు. ఇందుకు మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. 
 
గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments