Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ తమిళిసై విమోచన దినంపై సంచలన ట్వీట్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (12:12 IST)
గవర్నర్ తమిళిసై విమోచన దినంపై సంచలన ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17 విమోచన దినం జరుపుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
 
భారత దేశానికి ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1947 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నిజాం సర్కార్ నుంచి తెలంగాణను భారత్ దేశంలో విలీనం చేశారు. 
 
అయితే సెప్టెంబర్ 17పై రాజకీయంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఇది విమోచన దినోత్సవమా? విలీన దినోత్సవమా? లేక విద్రోహ దినోత్సవమా? అనే వివాదం నడుస్తోంది. బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం ఈరోజు విలీన దినోత్సవమని, కాంగ్రెస్ పార్టీ కూడా విలీన దినోత్సవమని అంటోంది. బీజేపీ మాత్రం విమోచనదినంగా చెబుతోంది. ఇప్పుడు గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ బీజేపీ నేతల హడావుడికి మద్దతు తెలిపినట్లుగా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments