Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త!

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:06 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచే యోచలో ఉంది.

ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఐతే రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచాలా? లేదంటే 60కి పెంచితే సరిపోతుందా? అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

త్వరలో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సమర్పించే రిపోర్టు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం కేసీఆర్.ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 26వేల మందికి పైగా ఉద్యోగులు వచ్చే మూడేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నారు.

వారంతా సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తే వారికి గ్రాట్యుటీతో పాటు ఇతర బెనిఫిట్స్ కల్పించాల్సి ఉంటుంది.

ఐతే రిటైర్మెంట్ వయసు పెంచితే ప్రస్తుతానికి ఇవన్నీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా రాబోయే మూడేళ్లలో ఏటా రూ.3500 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments