ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కారు స్వీట్ న్యూస్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (14:07 IST)
ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిపాలన కిందకు వచ్చే తెలంగాణలోని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా వర్కర్లకు) కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని 30 శాతం పెంచింది. కరోనా విజృంభిస్తున్న వేళ సర్కారు ఆశావర్కర్ల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పెంచింది.
 
ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు (జీవో ఎమ్‌ఎప్‌ నం 1)లో రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం గరిష్ట పరిమితిపై 30 శాతం చొప్పున పెంపుదల కోసం అనుమతిని ఇచ్చింది. దీంతో రూ.7, 500 నుండి రూ.9,750లకు నెలవారీ ప్రోత్సహకాలు పెరగనున్నాయి.
 
పనిభారం పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెరగవని ఆశా కార్మికులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి కనీస వేతనం చాలా తక్కువగా ఉంది.  వారు చేసే కృషికి కొంచెం ఎక్కువ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, టిఎలు మరియు డిఎలను కూడా ఇవ్వమని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరగడంతో ఆశా కార్మికులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కార్మికులకు ఉపశమనం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

తర్వాతి కథనం
Show comments