Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్దియా పోరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఓటర్లు.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రిజైన్

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:36 IST)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం 150 డివిజన్లకుగాను కేవలం రెండంటే రెండు సీట్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయంసాధించారు. అంటే.. ఈ బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
 
ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదివికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది. 
 
ఈ ఎన్నికల్లో  ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారగా, బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. ఇది తెరాసకు కూడా మింగుడు పడలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఓటర్లు మాత్రం మరోమారు తెరాసకే పట్టంకట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments