Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (13:35 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల మ్యాన్‌హోల్‌లో గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని అపుడే వెలికి తీశారు. గల్లంతైన మరో మృతదేహం కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలించాయి. ఈ గాలింపు చర్యల ఫలితంగా కార్మికుడు అంతయ్య గల్లంతైన ఆరు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. 
 
ఆరు రోజుల తర్వాత ఆయ‌న మృత‌దేహం బయటపడింది. మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహం ల‌భ్య‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆరు రోజులుగా కొన‌సాగిస్తోన్న‌ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఆరు రోజుల పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొంది.
 
కాగా, ఇటీవ‌ల రాత్రి స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మురికి కాలువలోకి దిగాల‌ని కాంట్రాక్టర్ చెప్ప‌డంతో మొద‌ట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుపోయాడు. ఇద్ద‌రూ మృతి చెందారు. దీంతో కాంట్రాక్టర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments