అత్యున్నత పదవుల్లో ఉన్న మహిళలకు కూడా గౌవరం లేదు : తెలంగాణ గవర్నర్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (08:04 IST)
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో సోమవారం మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో సాధారణ మహిళలకే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న మహిళలకు కూడా గౌరవరం దక్కడం లేదన్నారు. 
 
అయినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలను ఆమె మహిళా లోకానికి పిలుపునిచ్చారు. అత్యున్నత పదవిలో ఉన్న వారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తనను ఎవరూ భయపెట్టలేరని, తాను దేనికీ భయపడను కూడా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా, "కేవలం ఆధిపత్యం ఉన్న పురుషుల రెక్కలతో, దేశ పక్షి ఎగరదు. ఈ రోజు మనం వివక్షను అనుభవిస్తున్నాము. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ, మేము కూడా వివక్షను ఎదుర్కొంటున్నాం. భారతీయ స్త్రీ ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన స్త్రీ అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
గవర్నర్ తమిళిసై ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాంకేతి కారణాలను చూపి బీజేపీకి చెందిన తమిళిసైను తెరాస ప్రభుత్వం అసెంబ్లీకి ఆహ్వానించలేదు. దీనిపై ఆమె గుర్రుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments