Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు ఖాళీ చేసి సామాగ్రిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లు : లేడీ డాక్టర్‌కు బెదిరింపు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:59 IST)
కరోనా వైరస్ బారినపడుతున్న రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, ఇతర సహాయక సిబ్బంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళలో నివసించే వారికి ఆ గృహ యజమానుల నుంచి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వైద్యులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
తాజాగా సికింద్రాబాద్ నగరంలో స్విగ్దా అనే మహిళా వైద్యురాలికి గృహ యజమాని నుంచి తీవ్ర వేధింపులు వచ్చాయి. ఈ వైద్యురాలి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సేవలు అందిస్తోది. పైగా, కరోనా రోగులకు వైద్యం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని... ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. 
 
ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉంటోన్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, తన సామగ్రిని తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పెట్టుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆమె తెలిపింది. 
 
ఈ విషయాన్ని ఆమె తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments