Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల పాపపై మూడు వీధికుక్కలు పడ్డాయి.. ఏడుపు శబ్ధం విని..?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:34 IST)
నాలుగేళ్ల పాప వీధికుక్కల దాడికి గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకటి కాదు.. ఏకంగా మూడు కుక్కలు నాలుగేళ్ల పాపపై దాడికి దిగడంతో ఆ పాప వాటి నుంచి తప్పించుకోలేక ఏడ్వసాగింది. కేకలు పెట్టింది. ఆ పాప ఏడుపులు విని స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కుక్కలను తరిమికొట్టారు. పాపను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఉన్న కాలనీలో ఘోరం జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 
 
నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. ఆ పాప దాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లసాగింది. ఇంతలోనే ఊహించని రీతిలో ఆ కుక్క నందినిపై దాడి చేసింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాప భయాందోళనకు గురయింది.
 
కుక్కలు తనపై దాడి చేస్తోంటే ఏం చేయాలో తెలియక, వాటిని ప్రతిఘటించలేక గుక్కపట్టి ఏడవసాగింది. ఆ పాప ఏడుపులు విన్న స్థానికులు ఉరుకులు పరుగుల మీద ఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలను తరిమి కొట్టారు. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. పాప కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టు గుర్తించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments