Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదు.. మాక్ డ్రిల్

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని అది మాక్ డ్రిల్ అని తెలంగాణ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఏ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయనే దానిపై స్పష్టత లేదు. అయితే, ఈ మంటలను 11 అగ్నిమాపకదళ బృందాలతో వచ్చిన సిబ్బంది అదుపు చేశాయి. అలాగే, సచివాలయం సమీపంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. 
 
మరోవైపు ప్రమాదం ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోయర్ గ్రౌండ్‌లో ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. ముఖ్యంగా, ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని, మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపకదళ శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి కూడా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, అగ్నిప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. 
 
కానీ, జరిగింది అగ్నిప్రమాదం కాదని, కేవలం మాక్ డ్రిల్ అని చెప్పారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్‌లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. దాంతో జరిగింది అగ్నిప్రమాదమా? కాదా? అనే అంశంపై స్పష్ట లేదు. ఈ ప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగల ధాటికి సచివాయల వెనుక భాగంలోని ఓ గుమ్మటం నల్లగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments