Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మాస్కులు తప్పనిసరి.. వైద్యశాఖ కీలక నిర్ణయం

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (21:31 IST)
కరోనా మూడో వేవ్ నెమ్మదించడం, కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ వైద్య శాఖ కీలక విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాస్క్ నిబంధనల గురించి మాట్లాడారు.
 
60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవాళ్ల తప్ప మిగతా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం 'వ్యక్తిగత విషయం' అని అన్నారు. ముఖ్యంగా మాల్స్‌, మార్కెట్‌ల వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ నిబంధనలను పాటించకపోతే అధికారులు జరిమానా కూడా విధిస్తున్నారని హెల్త్ డైరెక్టర్ గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో కోవిడ్ అదుపులోకి వచ్చిందని, ప్రతిరోజూ 30-40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిందని విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, మాస్క్‌లు ధరించడం మంచిదని జి శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments