Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు!

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (11:18 IST)
దసరా పండుగ వేళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments