Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊసరవెల్లిలా బీజేపీ?? ... రేపొద్దున తెరాసతో చేతులు కలిపితే మా పరిస్థితేంటి?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (08:45 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి, తెరాస నేత ఈటల రాజేందర్ హస్తినకు వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చర్చల్లో పలు సందేహాలు లేవనెత్తారు. 
 
తెలంగాణలో బీజేపీ, తెరాస ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని జేపీ నడ్డాను సూటిగా ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. 
 
ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని నడ్డా తేల్చి చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments