Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్... ఓ తాగుబోతు సీఎం అందుకే కరెంట్ కష్టాలు : ఎర్రబెల్లి

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:56 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఓ తాగుబోతు సీఎం అని, అందుకే తెలంగాణ ప్రజలు కరెంట్ కష్టాలు పడాల్సి వచ్చిందని టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పచ్చి తాగుబోతైన ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. 
 
శ్రీశైలం జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనను మీడియా ముఖంగా ఖండించిన ఎర్రబెల్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. 
 
కేసీఆర్ తన చేష్టలతో ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపిస్తే... హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కును నేలకు రాస్తానని ఛాలెంజ్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments