Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రబెల్లి తెరాసలోకి రాకుండా అడ్డుకుంది నేనే : కడియం శ్రీహరి

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (14:06 IST)
టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ముమ్మరంగా కృషి చేశారనీ, అయితే, ఆయన తెరాసలో చేరకుండా తాను అడుడుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి టీఆర్ఎస్‌లోకి రావాలనుకున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. కానీ ఆయన టీఆర్ఎస్‌లోకి రాకుండా అడ్డుకుంది తానేనని కడియం వెల్లడించారు. తెలంగాణ ద్రోహులకు టీఆర్ఎస్‌లో ఎప్పటికీ స్థానం ఉండదని, పార్టీని విమర్శించే అర్హత కూడా ఎర్రబెల్లికి లేదన్నారు.
 
కాగా, గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరబోతున్నారంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అవన్నీ సద్దుమణిగాయి. ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయన తెరాసలో చేరకుండా అడ్డుకుంది తానేనని కడియం శ్రీహరి చెప్పడం మరో చర్చకు దారితీసేలా ఉంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments