Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీల యజమానుల గృహాల్లో ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూకుమ్మడిగా సోదాలకు దిగారు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు దాదాపు 30 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్‌లో ఈ సోదాలు చేశారు. 
 
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ, అత్తాపూర్‌లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగరులోని గ్రానైట్ వ్యాపాలే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గ్రానైట్ రాళ్ల ఎగుమతుల్లో భాగంగా పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే ఎనిమిది సంస్థలకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments