Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు ఈసీ షాక్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (09:19 IST)
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్‌.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై మూడేళ్లపాటు అనర్హత వేటువేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 
 
దీనిపై బలరాం నాయక్ స్పందించారు. గత ఎన్నికల్లో తాను మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశానని.. అప్పట్లో అన్ని రకాల పత్రాలను ఎన్నికల కమిషన్‌కు నివేదించానన్నారు. అయితే, సరైన పత్రాలు నివేదించలేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తనపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేసిందన్నారు. కానీ తన వద్ద అన్ని రకాల పత్రాలు సిద్ధంగా ఉన్నాయని.. నేరుగా ఎన్నికల కమిషన్‌కు కానీ, న్యాయస్థానం ద్వారా కాని తిరిగి పత్రాలను నివేదిస్తానంటూ తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ బలరామ్‌ నాయక్‌ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments