బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్..

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (12:49 IST)
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. తాజాగా ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి, పలువురు ఓయూ జేఏసీ నేతలు బీజేపీలో చేరారు. కాసేపట్లో వీరంతా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లనున్నారు.
 
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత విస్తరించడంలో తన శ్రమ ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు. త్వరలోనే మరిన్ని జిల్లాల నుంచి బీజేపీలో చేరికలుంటాయన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments