Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో చరిత్ర సృష్టించిన బీజేపీ...

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (16:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయభేరీ మోగించారు. 
 
ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్‌లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో... బీజేపీ చివరకు విజయనాదం చేసింది. 1,472 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు.
 
ఈ ఎన్నికలో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన తెరాస రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజేపీ గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
 
గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. బీజేపీ గెలుపుతో హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments