Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబుల నుంచి రూ.1.99 కోట్లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (13:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో మందుబాబుల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా భారీగా అపరాధం విధిస్తున్నారు. మద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పకూడ‌ద‌ని పోలీసులు ఎంత‌గా ప్రచారం చేస్తున్న‌ప్పటికీ మందుబాబులు వినిపించుకోవ‌ట్లేదు. 
 
గ‌త నెల‌లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల‌ను న‌మోదు చేశారు. అదేస‌మ‌యంలో భారీగా జ‌రిమానాల‌ను వ‌సూలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,917 మందిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.
 
వారిలో కోర్టు 58 మందికి రెండు రోజుల‌ నుంచి తొమ్మిది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగతా 1,859 మంది నుంచి రూ.1,99,56,300 జరిమానాను వసూలు చేశారు. 
 
మోతాదుకి మించి మద్యం తాగ‌డం, ప‌దే ప‌దే నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ ముగ్గురికి తొమ్మి రోజుల జైలు శిక్ష ప‌డింది. ప‌ది మందికి ఏడు రోజులు, 25 మందికి ఐదు రోజులు, 20 మందికి రెండు రోజుల జైలు శిక్షను విధించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments