తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్.. సబ్సీడీపై డ్రోన్లు.. స్ప్రే అలా చేసేస్తాయి..!

Webdunia
బుధవారం, 20 జులై 2022 (10:24 IST)
తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా తెలంగాణ వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులకు ఈ ఏడాది నుంచే సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లు పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. 
 
డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. 
 
డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుంది. కొన్ని పంటలకు మొక్కలపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. వాటికి ఎలా స్ప్రే చెయ్యాలి అనేది సెట్ చేసి పెట్టాలి. ఇకపోతే పంట ఎలా ఉంది అనేదానిని కూడా ఫోటోలు తీసి వ్యవసాయ నిపుణులకు పంపిస్తుంది. రైతులకు ఎటువంటి నష్టాలు కలగా కుండా డ్రోన్లు సహాయ పడతాయని అధికారులు అంటున్నారు.
 
రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని ప్రభుత్వం పలు నిర్ణయాలు ముందుకెళ్తోంది. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందజేస్తోన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments