Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్.. సబ్సీడీపై డ్రోన్లు.. స్ప్రే అలా చేసేస్తాయి..!

Webdunia
బుధవారం, 20 జులై 2022 (10:24 IST)
తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా తెలంగాణ వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులకు ఈ ఏడాది నుంచే సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లు పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. 
 
డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. 
 
డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుంది. కొన్ని పంటలకు మొక్కలపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. వాటికి ఎలా స్ప్రే చెయ్యాలి అనేది సెట్ చేసి పెట్టాలి. ఇకపోతే పంట ఎలా ఉంది అనేదానిని కూడా ఫోటోలు తీసి వ్యవసాయ నిపుణులకు పంపిస్తుంది. రైతులకు ఎటువంటి నష్టాలు కలగా కుండా డ్రోన్లు సహాయ పడతాయని అధికారులు అంటున్నారు.
 
రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని ప్రభుత్వం పలు నిర్ణయాలు ముందుకెళ్తోంది. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందజేస్తోన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలీఘర్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన బన్నీ వీరాభిమాని (వీడియో)

సిటాడెల్ ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన సమంత.. లుక్ అదరహో.. యాక్షన్ భలే!

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ గ్రాండ్ రీ రిలీజ్

మోహన్ లాల్ భారీ చిత్రం L2 ఎంపురాన్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

తర్వాతి కథనం
Show comments