Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెలాఖరు వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసిన యూనివర్శిటీ

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:40 IST)
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలు కూడా మూసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదావేస్తున్నట్టు హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ పరీక్షలను తదుపరి నిర్వహించేందుకు వీలుగా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వర్శిటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వాయిదావేసింది. అయితే, ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments