ఈ నెలాఖరు వరకు అన్ని పరీక్షలు వాయిదా వేసిన యూనివర్శిటీ

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:40 IST)
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేకాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలు కూడా మూసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదావేస్తున్నట్టు హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు పేర్కొంది. ఈ పరీక్షలను తదుపరి నిర్వహించేందుకు వీలుగా కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వర్శిటీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
దీంతో మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వాయిదావేసింది. అయితే, ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్శిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments