Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు.. శ్మశానికి తీసుకెళ్తుంటే కళ్లు తెరిచింది...

బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (16:48 IST)
బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన తల్లిదండ్రులు.. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఆశ్చర్యకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు బరువు తక్కువతో ఓ శిశువు జన్మించింది. దీంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మూడు రోజులు చికిత్స తర్వాత పాప చనిపోయిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రాణాలతో ఉన్న మూడు రోజుల పసికందు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారి మృతి చెందిందని మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు వైద్యులు. ఈ క్రమంలో పాపను అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. చిన్నారి కదలడం చూసి మళ్లీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పసికందుకు వైద్యులు మళ్లీ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తీరుపై పాప కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments