Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు కొత్త నిజాంలా తయారైన కేసీఆర్: డిగ్గీరాజా ఫైర్

Webdunia
శనివారం, 4 జులై 2015 (10:46 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్సి దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌కు కొత్త నిజాంలా కేసీఆర్ తయారయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటించడానికి కేసీఆర్‌కు రూ. 5 కోట్ల విలువైన బస్సు అవసరమా? అని ప్రశ్నించారు. ముందు ఎన్నికల హామీలను నెరవేర్చాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆరర్ గాలికి వదిలేశారని, కోట్ల విలువైన బస్సులు, హంగామాలు, హంగులతో కాలం గడిపేస్తున్నారని ఫైర్ అయ్యారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవంలోనూ తనదైన శైలిలో కేసీఆర్ మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఆయన ప్రసంగిస్తూ దోమకు సోషలిజాన్ని ఆపాదించి అందరినీ నవ్వించారు. చెత్త ఎక్కడుంటే దోమ అక్కడుంటుందని తెలిపారు. అయితే, దోమకు తేడాలు తెలియవని, అది ఎవరినైనా కుడుతుందని చెప్పుకొచ్చారు.
 
"అందుకే దోమను సోషలిస్టు అనాలి. ఎమ్మెల్యేని కానివ్వండి, మంత్రిని కానివ్వండి... చివరికి ముఖ్యమంత్రినైనా అది కుడుతుంది. ఎదురుగా ఎవరు వస్తున్నా దానికి అనవసరం. ఊరి సర్పంచ్ వస్తున్నాడా... లేక, మంత్రి వస్తున్నాడా అనేది పట్టించుకోదని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో అందరి నవ్వేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments