Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదీ కేసీఆర్ దెబ్బంటే... కోదండరామ్ ఇక ఒంటరే... టీజేఏసీలో లుకలుకలు...

తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:24 IST)
తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ప్రొ.కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై సమరశంకం పూరించారు. ఐతే ర్యాలీ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీనితో టీజేఏసీ కోర్టుకెక్కింది. 
 
నాగోల్‌లో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఐతే కోదండరాం దీనికి విముఖత తెలిపారు. నగరంలోనే ర్యాలీ నిర్వహించాలని మొండికేశారు. దీనిపైనే ఇపుడు టీజేఏసీలో రచ్చ అయింది. కోదండరాం నిర్ణయంపై జేఏసీ కన్వీనర్ రవీందర్ అసహనం వ్యక్తం చేశారు. బాహాటంగా విమర్శలు చేశారు. ఆయనతోపాటు మరికొందరు గళం కలిపారు. మొత్తమ్మీద ర్యాలీ చేసి గంటలు కూడా కాకమునుపే జేఏసీలో లుకలుకలు చూస్తుంటే కేసీఆర్ అంటే మజాకా అని అర్థమవుతుంది కదూ. భవిష్యత్తులో ఇక కోదండరాం ఒంటరిగా మిగులుతారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments