Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ బిర్యానీ పెడుతున్నారని అమిత్ షాకు కుళ్లెందుకు?: ఓవైసీ

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (18:29 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ సెటైర్లు విసిరారు. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బిర్యానీ పంపిస్తున్నారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్ధీన్ కౌంటరిచ్చారు. ఇతరులు బిర్యానీ తింటుంటే.. ఎందుకంత కడుపు మంటా? అంటూ నిలదీశారు. 
 
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారనే విషయాన్ని గుర్తు చేసిన ఓవైసీ.. ఆ ఫంక్షన్‌లో ఏం పెట్టారా తెలియదా అంటూ ప్రశ్నించారు. అమిత్ షా బిర్యానీ ఇష్టపడతారని తనకు తెలియదన్నారు. 
 
ఒకవేళ తెలిసివుంటే అప్పుడే కళ్యాణీ బిర్యానీ పంపించమని కేసీఆర్‌కు చెప్పేవాడినని ఓవైసీ అన్నారు. కేసీఆర్ బిర్యానీ పెట్టలేదని అమిత్ షా కుళ్లుకుంటున్నారని.. ఈసారి కచ్చితంగా అమిత్ షాకు కళ్యాణీ బిర్యానీ పార్సిల్ పంపిస్తామని ఓవైసీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments