Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా? : డీకే అరుణ

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:07 IST)
దుబ్బాక  బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర బలగాలను భద్రత కోసం పంపాలన్నారు.

హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్​ఎస్ పై వ్యతిరేకత ఉందని, అందుకే  ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు బంధువులు ఇండ్ల పై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

‘‘పోలీసులు గులాబీ చొక్కాలు తొడుక్కున్నరా.. టీఆర్​ఎస్​ కండువాలు వేసుకున్నరా పోలీసుల వెహికల్స్ లో డబ్బులు పంపుతున్నరు. కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదనే విషయం గుర్తించుకోవాలి అని ఆమె హెచ్చరించారు.

పోలీసులంటే ప్రజలు అస్యహించుకునేలా చేసుకోవద్దన్నారు. బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తెలుసుకున్న టీఆర్ ఎస్ అడ్డదారులు తొక్కుతున్నదని,  మంత్రి హరీశ్​ వ్యవహార శైలి సరిగా లేదని, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు.

ఎన్నికలు సరిగా జరిగేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాక లో బీజేపీని  గెలిపించాలని, టీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పాలని, ఒక చారిత్రక తీర్పు దుబ్బాక ఓటర్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments