Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు నిధులు విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:58 IST)
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల చేశారు. దళితబంధు అమలుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వాసాలమర్రివాసులకు దళితబంధు పథకం తొలి ప్రయోజనం అందనుంది. 
 
మొత్తం గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా వారికి రూ.7.60 కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వాసాల మర్రి గ్రామంలో పండగ మొదలైంది. 
 
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో వాసాలమర్రిలో బతుకమ్మ పండుగ ముందే వచ్చింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ అందులోనే మునిగి తేలుతున్నారు. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నందుకు కేసీఆర్ కు గ్రామస్తులు కృతజ్ణతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments