పనిచేయని సీఎం కేసీఆర్ మంత్రం .. 'దళితబంధు' గ్రామంలోనూ కారుకు చుక్కెదురు

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (11:36 IST)
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మంత్రం పనిచేయలేదు. తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం కూడా తెరాస అభ్యర్థిని గెలిపించలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇటు కేసీఆర్ మంత్రం, అటు దళితబంధు పని చేయనట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వెడువడుతున్న ఫలితాల సరళిని చూస్తుంటే ఈ విషయం తేటతెల్లమవుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సమాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 50 వేల వరకు ఉంటారు. వీరందరిపై దళితబంధు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. తెరాస పార్టీ కూడా ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
 
అయితే అంచనాలకు విరుద్ధంగా దళితబంధు ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. 
 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి సమక్షంలో భారీ బహిరంగసభలో ఈ పథకాన్ని ఆరంభించారు. పథకానికి సంబంధించి వివరాలను ఆయనే స్వయంగా వేదికపై నుంచే అందరికీ వివరించారు. అయితే, శాలపల్లిలో వెలువడిన ఫలితాను టీఆర్ఎస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యతను సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satya Dev: శ్రీ చిదంబరం కథను నాకు ముందు చెప్పారు : సత్య దేవ్

Saikumar: యాభై ఏళ్ల నట జీవితంలో అరి.. లో నటించడం గర్వంగా ఉంది - సాయికుమార్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments