అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.
 
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ, యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డీఎస్ చిన్న కుమారుడు డి.అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments