Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.
 
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ, యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డీఎస్ చిన్న కుమారుడు డి.అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments