Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:16 IST)
ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముచ్చటగా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా ముగ్గురుని వివాహం చేసుకున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2011లో ఓ మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెను వదిలివేశాడు. 
 
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. యేడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శారదకు దూరంగా ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను లోబరుచుకుని తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మూడు పెళ్లిళ్ళ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments