Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:16 IST)
ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముచ్చటగా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా ముగ్గురుని వివాహం చేసుకున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2011లో ఓ మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెను వదిలివేశాడు. 
 
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. యేడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శారదకు దూరంగా ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను లోబరుచుకుని తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మూడు పెళ్లిళ్ళ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments