ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:16 IST)
ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముచ్చటగా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా ముగ్గురుని వివాహం చేసుకున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2011లో ఓ మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెను వదిలివేశాడు. 
 
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. యేడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శారదకు దూరంగా ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను లోబరుచుకుని తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మూడు పెళ్లిళ్ళ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments