Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రేమ వివాహం, పెద్దల ఆశీర్వాదాల కోసం వస్తుండగా...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:19 IST)
వారిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాల కోసం స్వస్థలానికి బయలుదేరారు. ఐతే ఇంతలోనే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
 
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బ‌ట్టు స‌తీశ్, హైద‌రాబాద్‌లోని గండి మైస‌మ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మ‌హిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుందామని బైక్ పైన వస్తుండగా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీనితో మహిమ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సతీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments