Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రేమ వివాహం, పెద్దల ఆశీర్వాదాల కోసం వస్తుండగా...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:19 IST)
వారిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాల కోసం స్వస్థలానికి బయలుదేరారు. ఐతే ఇంతలోనే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
 
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బ‌ట్టు స‌తీశ్, హైద‌రాబాద్‌లోని గండి మైస‌మ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మ‌హిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుందామని బైక్ పైన వస్తుండగా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీనితో మహిమ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సతీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments