Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రేమ వివాహం, పెద్దల ఆశీర్వాదాల కోసం వస్తుండగా...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:19 IST)
వారిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాల కోసం స్వస్థలానికి బయలుదేరారు. ఐతే ఇంతలోనే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
 
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బ‌ట్టు స‌తీశ్, హైద‌రాబాద్‌లోని గండి మైస‌మ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మ‌హిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుందామని బైక్ పైన వస్తుండగా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీనితో మహిమ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సతీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments