సహజీవనం ఒకరి ప్రాణం తీసింది.. పెట్రోల్ పోసి నిప్పంటించుకుని..?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:32 IST)
సహజీవనం ఒకరి ప్రాణం తీసింది. హైదరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఓ ఆసుపత్రిలో పనిచేసే వెంకటలక్ష్మికి వెల్డింగ్ దుకాణంలో పనిచేసే వెంకటేష్‌(55)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఇక లక్ష్మికి భర్త పదేళ్ల కిందనే మరణించాడు ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉండగా, కూతురికి పెళ్లి చేసింది. వెంకటేష్‌ భార్య చనిపోయింది. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరికీ భార్య, భర్త లేకపోవడంతో వీరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి మధ్య ప్రేమ పెరిగింది.
 
ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్న లక్ష్మి దూరం పెట్టడంతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. ఆమె ఎడబాటు తట్టుకోలేక వెంకటేష్ ఏకంగా ఓ రోజు రాత్రి కూకట్ పల్లి లోని లక్ష్మి నివాసానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
అనంతరం వారు ఉన్న గుడిసెలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇద్దరూ కాలిన గాయాలతో కనిపించడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనతో ఉండటానికి లక్ష్మి ఒప్పుకోలేదని వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?

Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments