సహజీవనం ఒకరి ప్రాణం తీసింది.. పెట్రోల్ పోసి నిప్పంటించుకుని..?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:32 IST)
సహజీవనం ఒకరి ప్రాణం తీసింది. హైదరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఓ ఆసుపత్రిలో పనిచేసే వెంకటలక్ష్మికి వెల్డింగ్ దుకాణంలో పనిచేసే వెంకటేష్‌(55)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఇక లక్ష్మికి భర్త పదేళ్ల కిందనే మరణించాడు ఆమెకు ఒక కూతురు, కొడుకు ఉండగా, కూతురికి పెళ్లి చేసింది. వెంకటేష్‌ భార్య చనిపోయింది. ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరికీ భార్య, భర్త లేకపోవడంతో వీరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి మధ్య ప్రేమ పెరిగింది.
 
ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్న లక్ష్మి దూరం పెట్టడంతో వెంకటేష్ మానసికంగా కుంగిపోయాడు. ఆమె ఎడబాటు తట్టుకోలేక వెంకటేష్ ఏకంగా ఓ రోజు రాత్రి కూకట్ పల్లి లోని లక్ష్మి నివాసానికి వెళ్లారు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
అనంతరం వారు ఉన్న గుడిసెలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇద్దరూ కాలిన గాయాలతో కనిపించడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తనతో ఉండటానికి లక్ష్మి ఒప్పుకోలేదని వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments