Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ లేకుండా పోయింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:22 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి పత్రిలకెక్కిన ఆయన తాజాగా మరోమారు వార్తల్లో నిలించారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ తీవ్రంగా భయపెట్టిందన్నారు. ఇపుడు దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏసు ప్రభువన్నారు. 
 
"మనం అందించిన వైద్య సేవలతో కాదు.. ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు" అని శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments