Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ లేకుండా పోయింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:22 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి పత్రిలకెక్కిన ఆయన తాజాగా మరోమారు వార్తల్లో నిలించారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ తీవ్రంగా భయపెట్టిందన్నారు. ఇపుడు దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏసు ప్రభువన్నారు. 
 
"మనం అందించిన వైద్య సేవలతో కాదు.. ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు" అని శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments