Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన్ కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:02 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కేవలం సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అంటే.. ఈ రాష్ట్రంలో కొత్త కేసులు కేవలం పదిలోపు మాత్రమే నమోదవుతున్నాయి. మంగళవారం ఆ రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది నిజంగానే శుభపరిణామం. 
 
నిజానికి గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అది మంగళవారానికి కేవలం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1003 కరోనా కేసులు ఉన్నాయి. 
 
అలాగే, ఒకే రోజులో కరోనా చికిత్స ముగించుకుని 16 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 332 మంది స్వేచ్ఛ పొందారు. 25 మంది చనిపోయారు. 646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 556 కేసులు ఉండగా, సూర్యాపేటలో 83 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంత 18859 మందికి ఈ కరోనా పరీక్షలు నిర్వహించారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. మంగళవారం కూడా మరో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 70 కేసులు కేవలం మూడు జిల్లాలు అంటే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments