Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు కరోనా ఊరట

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (21:14 IST)
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు బుధవారం కాస్త ఊరట లభించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ సంఖ్య బుధవారం అనూహ్యంగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. బుధవారం కొత్తగా తెలంగాణలో 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 943కి చేరింది. కరోనాతో బుధవారం ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 24కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ప్రకటించింది. ఇప్పటివరకూ 194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయనట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత బుధవారం కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి.

ఈ బుధవారం 15 కేసులు నమోదు కావడం గమనార్హం. వారం వ్యవధిలో నమోదైన కేసులను పరిశీలిస్తే మళ్లీ ఈ బుధవారమే ఇంత కనిష్టంగా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments