Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో ఒక్కరి నుంచి 8మందికి కరోనా

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (09:36 IST)
ఖమ్మం జిల్లాలో సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్‌ఎస్‌టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సదరు వ్యక్తి కుటుంబీకులు, కాంటాక్ట్‌ వ్యక్తులు 20 మంది నుంచి ఆదివారం నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో వారిలో 8 మందికి వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారించారు.

అలాగే తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన చిన్నారి, ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన యువకుడు కొవిడ్‌-19 లక్షణాలతో ఆస్పత్రికి రాగా పరీక్షలు నిర్వహించారు.

వారికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ బాధితులందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక సత్తుపల్లి పట్టణ కేంద్రానికి చెందిన క్యాన్సర్‌ బాధితుడు హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ కరోనా బారిన పడ్డారు.

వీరితో పాటు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో మరో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఒకే రోజు 12 కేసులు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments