Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో ఒక్కరి నుంచి 8మందికి కరోనా

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (09:36 IST)
ఖమ్మం జిల్లాలో సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్‌ఎస్‌టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సదరు వ్యక్తి కుటుంబీకులు, కాంటాక్ట్‌ వ్యక్తులు 20 మంది నుంచి ఆదివారం నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో వారిలో 8 మందికి వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారించారు.

అలాగే తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన చిన్నారి, ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన యువకుడు కొవిడ్‌-19 లక్షణాలతో ఆస్పత్రికి రాగా పరీక్షలు నిర్వహించారు.

వారికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ బాధితులందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక సత్తుపల్లి పట్టణ కేంద్రానికి చెందిన క్యాన్సర్‌ బాధితుడు హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ కరోనా బారిన పడ్డారు.

వీరితో పాటు పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో మరో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఒకే రోజు 12 కేసులు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments