Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రావిరాలలో బుధవారం పీసీసీ నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ పరిధిలోని రావిరాలలో సభను నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. 
 
2014 నుంచి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతోందని, ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారన్నారు. 
 
దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రావిరాలలో జరిగే సభకు కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, రేవంత్‌ అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments