Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్, సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:11 IST)
రైతుల డిమాండ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇవాల హైదరాబాదు ప్రగతి భవన్ ముట్టడి జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు.
 
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు.దీనికి తోడుగా రైతులకు రుణమాపీ చేయాలని అన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా సీతక్కను పోలీసులు అరెస్ట్ చేయడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తనను అరెస్ట్ చేయడం పట్ల సీతక్క ట్విట్టర్లో మండిపడ్డారు. నేనేమైనా టెర్రరిస్టునా అంటూ ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు వెళితే అరెస్ట్ చేసారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments