అప్పుడేమో నిజాం నవాబులు.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు.. విజయమ్మ

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:12 IST)
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఉదయమే ప్రారంభం అయింది. ఇప్పటికే బొప్పాపూర్‌ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, చిట్టాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీపై  కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. 
 
దుబ్బాక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. "నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో అదే ధోరణిలో నేటి నయా టీఆర్ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి... తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవమని చెప్పుకొచ్చారు. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నానని విజయశాంతి మండిపడ్డారు. 
 
. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్ష పై యావత్ తెలంగాణ చర్చించుకుంటుందని చెప్పారు. సీఎల్పీ విలీనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్ష కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో టీఆర్ఎస్ వరుస తప్పులు చేస్తోందని విజయశాంతి విమర్శించారు. 
 
ఇటీవల ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని.. వైసీపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు సంబుర పడ్డారని.. అనంతరం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఘోర పరాజయం పాలయ్యారని తెలిపారు. తెలంగాణలోనూ అటువంటి పరిస్థితి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments