Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:31 IST)
ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014 ఏప్రిల్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో బొడిగె శోభ ఆస్తుల విలువ రూ.రెండు కోట్ల లోపేనని గుర్తు చేశారు. 
 
అప్పుడు టీవీఎస్‌ బైక్‌, ఇండికా కారు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఆస్తులు రూ. 40కోట్ల వరకు చేరాయని ఆరోపించారు. ఈ ఆస్తులు ఆమెకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆమె ఆస్తుల వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి సీబీఐ, ఏసీబీ, కోర్టులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు శోభ ఆస్తుల వివరాలను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments