Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు. ఈ జిల్లాలోని బాన్సువాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి కారులో రోడ్డు మార్గంలో తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. 
 
అక్కడ శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న తర్వాతీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు సాగనుంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బాన్సువాడ పట్టణంతో పాటు ఆలయ ప్రాగణం, పరిసర ప్రాంతాలను సీఎం వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్ స్క్వాడ్ నిశితంగా తనిఖీలు నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments