కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్ : తాజా పరీక్షల్లో నెగెటివ్

Webdunia
బుధవారం, 5 మే 2021 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. రెండింటిలోనూ నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. 
 
కాగా, ముఖ్యమంత్రికి గతనెల 28న నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. యాంటీజెన్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లో నెగెటివ్‌ రాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్ట్‌లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు తెలిపారు. 
 
వైరస్‌ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్‌ ఎంవీ రావు అన్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడంతో సీఎం పూర్తిగా కోలుకున్నట్టేనని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు.. : పాత ఫోటోపై క్లారిటీ ఇచ్చిన పవన్ సతీమణి

Tamannaah Bhatia: తమన్నా భాటియాకు కోర్టులో చుక్కెదురు

Nikhil: నిఖిల్ సిద్ధార్థ్.. స్వయంభు నుంచి రారా దేవరా.. సాంగ్ వచ్చేసింది

Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు

Satya Dev నా నుండి మరో సినిమా చూడాలని కీరవాణి గారు అడిగారు : వెంకటేష్ మహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

Diabetic Kidney Disease, డయాబెటిక్ కిడ్నీ వ్యాధి నిరోధించేందుకు సింపుల్ టిప్స్

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments