Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్ : తాజా పరీక్షల్లో నెగెటివ్

Webdunia
బుధవారం, 5 మే 2021 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. రెండింటిలోనూ నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. 
 
కాగా, ముఖ్యమంత్రికి గతనెల 28న నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. యాంటీజెన్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లో నెగెటివ్‌ రాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్ట్‌లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు తెలిపారు. 
 
వైరస్‌ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్‌ ఎంవీ రావు అన్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడంతో సీఎం పూర్తిగా కోలుకున్నట్టేనని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments