తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయుల తీపి కబురు చెప్పింది. ఏకంగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు.
శాసనసభ వేదికగా పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తూ, 30 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించింది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైనది అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడిందన్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి మరువలేనిది అని స్పష్టం చేశారు.