Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు : 30 శాతం ఫిట్మెంట్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (12:45 IST)
తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌ తీపి కబురు చెప్పింది. ఏకంగా 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. అలాగే, రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. 
 
శాస‌న‌స‌భ వేదిక‌గా పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తూ, 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. 
 
ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీల‌కు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించారు. క‌రోనా వ‌ల్ల ఈసారి వేత‌న స‌వ‌ర‌ణ ఆలస్య‌మైంద‌న్నారు. ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి చేసుకుంటున్నామ‌ని చెప్పారు. 
 
పీఆర్సీపై త్రిస‌భ్య క‌మిటీ అన్ని ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించింది. ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర అనిర్వ‌చ‌నీయ‌మైన‌ది అని కొనియాడారు. ఉమ్మ‌డి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడింద‌న్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచ‌డంలో టీఎన్జీవో స్ఫూర్తి మ‌రువ‌లేనిది అని స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments