Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (17:33 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో ఆయన అన్ని విషయాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశం అనంతరం తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. 
 
కాగా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్‌కు సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెరాస ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. అలాగే, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments