Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని చూసి కేసీఆర్ భయపడుతున్నారు.. ఖుష్బూ

Webdunia
శనివారం, 2 జులై 2022 (21:41 IST)
ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని బీజేపీ నేత, నటి ఖుష్బూ చెప్పుకొచ్చారు. హైదరాబాదు నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు. 
 
మోదీజీ వెనక్కి పోవాలంటూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్‌ పెట్టారని.. వీటిని చూస్తుంటే టీఆర్ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. 
 
మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని కుష్బూ అన్నారు. 
 
వారసత్వ రాజకీయాలను సహించేది లేదని ఖుష్బూ చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అది ప్రజలే చూస్తారని ఖుష్బు స్పష్టం చేశారు.
 
భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. 
 
షెడ్యూల్‌ కంటే మోదీ 10 నిమిషాలు ఆలస్యంగా మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ స్థలిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments