Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదస్థలంలో సీఐడీ విచారణ బృందం

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (13:29 IST)
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో సీఐడీ విచారణ బృందం శనివారం జల విద్యుత్ కేంద్రానికి చేరుకుంది. విచారణ కమిటీ సభ్యులు జల విద్యుత్ కేంద్రంలోకి వెళ్లారు. 
 
వీరితో పాటు విద్యుత్, ఫోరెన్సిక్, సీఐడీ, లోకల్ పోలీస్ టీంలు పవర్ హోస్‌లోకి వెళ్లాయి. సి.ఐ.డి డిఎస్పీ, సిఐలు, ఎస్.ఐలు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే, సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్ పవర్ హోస్‌లోకి వెళ్ళారు. జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. 
 
జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన డీఈలు, ఏఈలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్లు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ బృందం ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఓ నివేదిక ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments