Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:08 IST)
కరోనా వైరస్ నివారణలో భాగంగా రేపటి నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్ 19 వైరస్(కరోనా వైరస్) కారణంగా మార్చి 19 నుండి 25వ తేదివరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని అన్నారు. 
 
అయితే ఈ వారం రోజులు.. స్వామి వారి ఆరాధన రోజు జరుగుతుంది కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్నారు. దేవాలయ అర్చకులు పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు రేపటి నుండి ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్టళ్లు మూసి వేయడం జరిగిందని,  వైరస్ ప్రభావం ఉన్నందున దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నామని అన్నారు.
 
ఈ నిర్ణయంపై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గుడికి చాలా మంది భక్తులు  వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments