Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణా వాసుల మృతి

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:42 IST)
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణా వాసులు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రమాద సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఎనిమిది మంది పర్యాటకుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చి వారు దుర్మరణం పాలయ్యారు. వీరిని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలవారిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. 
 
ఈ ప్రమాదం అమరావతి జిల్లాలోని చికల్దారా సమీపంలో జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఏపీ 28 డిడబ్ల్యూ 2119గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments