Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణా వాసుల మృతి

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:42 IST)
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణా వాసులు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రమాద సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఎనిమిది మంది పర్యాటకుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చి వారు దుర్మరణం పాలయ్యారు. వీరిని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలవారిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. 
 
ఈ ప్రమాదం అమరావతి జిల్లాలోని చికల్దారా సమీపంలో జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఏపీ 28 డిడబ్ల్యూ 2119గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments