Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణా వాసుల మృతి

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:42 IST)
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణా వాసులు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రమాద సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఎనిమిది మంది పర్యాటకుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చి వారు దుర్మరణం పాలయ్యారు. వీరిని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలవారిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. 
 
ఈ ప్రమాదం అమరావతి జిల్లాలోని చికల్దారా సమీపంలో జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఏపీ 28 డిడబ్ల్యూ 2119గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments